గత ఎన్నికలనుంచి వైఎస్ జగన్ గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనపడటంలేదు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీకి శాపంగా మారనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలవేల పార్టీలోని నాయకులందరినీ కలసి కట్టుగా ముందుకు తీసుకెల్లాల్సిన అధినేత చేస్తున్న తప్పులు పార్టీనీ తీవ్రంగా కుదిపేస్తున్నాయి.
మొదటినుంచి పార్టీకోసం పనిచేస్తున్న నాయకులనుడబ్బు లేదనే నెపంతోనే లేక మరేదో కారణంగానో అభ్యర్థులను మార్చడం మొదటికే మోసం వస్తోంది. ఇప్పటికే కర్నూలు, విజయవాడ, గుంటూరులలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కాదని పార్టీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి నియోజక వర్గ బాధ్యతలు అప్పగించడం, అలాగే విజయవాడ సెంట్రల్ టికెట్ ను వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు కేటాయించడం ఇక గుంటూరులో వడుదల రజిని వారికి టకెట్లు కేటాయించడంతో పాటు సమన్వయ కర్తలను మార్చడం లాంటివి చేయడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్న సంగతి తెలిసిందే.
ఇక అత్యంత కీలకమైన ఐటీ రాజధాని విశాఖలోనూ సమన్వయ కర్తలను చాలా తేలికగా మార్చేస్తున్నారు జగన్. మటన్ బిర్యానీ తిన్నంత ఈజీగా నియోజక వర్గ సంన్వయ కర్తలను మార్చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే ఎలమంచిలి, విశాఖ ఉత్తరం, దక్షిణం సమన్వయకర్తలను తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.
పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తవారిని నియమించే యోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సమన్వయకర్తగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వచ్చే ఎన్నికల్లో రూ.15 కోట్లు ఖర్చుపెట్టగలవా? అని పార్టీలో కీలక నేత ఒకరు నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అంత మొత్తం ఖర్చుపెట్టలేనని బాబూరావు సమాధానం ఇవ్వడంతో…పక్కకు తప్పుకుంటే పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పదవి ఇస్తామని చెప్పినట్టుప్రచారం జరుగుతోంది.
పార్టీ తీరుపై అసంతృప్తికి గురైన ఆయన్ను పార్టీకి చెందిన ఒక ఎంపీ ఫోన్ చేసి తొందరపడవద్దని సూచించినట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ మరణంతర్వాత జగన్వెంటే నడిచారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట టిక్కెట్ను చెంగల వెంకట్రావు కేటాయించడంతో గొల్ల బాబూరావు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్న బాబురావు ఈ వార్త వినడంతో ఆయన తీవ్రంగా మదనపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇలా సమన్వయ కర్తలను మారుస్తుంటే పార్టీ నష్టం కలిగిస్తుందనడంలో సందేహంలేదు.