- Advertisement -
ఆంధ్రప్రదేశ్లో భాజాపా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు బాబు తన స్టిక్కర్ వేసుకుంటున్నాడని అందుకే ఆయనను స్టిక్కర్ బాబు అంటారంటూ ఎద్దేవ చేశారు. పోలవరం ప్రాజెక్టు బాబు ఏటీఎమ్గా మారింపోయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.అంతేకాకుండా ఏపీలో చంద్రబాబు బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్ర పోషిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. బాబు తన హెరిటేజ్ కోసం పనిచేస్తుంటె భాజాపా ఆంధ్రా హెరిటేజ్ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు.