తమ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు టిడిపి ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్వద్ద ఆమరణ దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా జనసేన అధినేత పవన్నుకూడా చెడగుడు ఆడుకున్నారు.
పవన్ సినిమాకు తక్కు…ఇంట్రవెల్కు ఎక్కువని ఎద్దేవ చేశారు. నాలుగు సంవత్సరాలుగా పవన్ ఏం చేశారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. నాలుగేళ్ళుగా ఏదైనా సమస్య వచ్చిన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అప్పుడప్పుడు సోషియల్ మీడియాలో ట్వీట్లు చేయడం తప్ప ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో ఎప్పుడైనా చంద్రబాబును ప్రశ్నించారాని విమర్శించారు.
ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన దానిలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడ ఉందని జగన్ విమర్శించారు. 15 రోజుల క్రితమే బాబుతో పవన్ కళ్యాణ్ తెగ దెంపులు చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు. పవన్ అనే మేధావికి సమాధానం చెప్పాలంటే అడిగేదానికి ఆయనకన్న బుద్దుండాల చెప్పేదానికి నాకన్నా బుద్దిండాలిని సెటైర్ వేశారు.