Monday, April 29, 2024
- Advertisement -

రాహుల్ కి పట్టాభిషేకం తొందరలోనే..?

- Advertisement -

కాంగ్రెస్ అసమ్మతి నేతలతో సోనియా గాంధీ సమావేశమయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో సీనియర్​ నేతలు తమ అభిప్రాయాలను సోనియాకు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్​కు బాధ్యతలు అప్పగించే విషయంపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా తీసుకునేందుకు రాహుల్​ సిద్ధమని సీనియర్ నేతలు పేర్కొన్నారు.

పార్టీలో అసమ్మతి లేదని సీనియర్​ నేత పవన్​ బన్సల్​ తెలిపారు. కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు అందరం ఐకమత్యంతో ముందుకుసాగుతామని పేర్కొన్నారు. పార్టీ పెండింగ్ అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చిస్తామని, త్వరలోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రాహుల్ అధ్యక్షుడు అయ్యేందుకు ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైందని సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఇదే తరహాలో మరికొన్ని భేటీలు జరుగుతాయని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -