- Advertisement -
టీడీపీనుంచి కాంగ్రెస్లోకి వెల్లిన రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు. స్పీకర్ ను కలిసేందుకు రేవంత్ ప్రయత్నించారు. కానీ, అందుకు, స్పీకర్ అంగీకరించకపోవడంతో తన లేఖను సంబంధిత కార్యాలయంలో అందజేశారు.
కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడిలో లేదని, అందుకే, నిరసన వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశానని రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఇలాంటి పిచ్చోడు ప్రాతినిథ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం ఇష్టం లేకనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.