టీడీపీ నేత సబ్బం హరి విషయం ఇప్పుడు రాష్ట్రమంతటా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చేసిన సంఘటన టీడీపీ కి పెద్ద అక్రమంగా మారిపోయింది.. చంద్రబాబు అయితే ఈ విషయాన్నీ పెద్ద ఉద్యమంగా చేయాలనీ చూస్తున్నారు.. దీనికి రాజకీయంగా లింక్ పెట్టి పెద్ద ఇష్యూ చేయాలనీ చూస్తున్నారు.. ఇదేం పెద్ద విషయమే కానట్లు, నార్మల్ గా అందరు చేసే పని అన్నట్లు అయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే టీడీపీ వారు అక్రమాలు చేసినా చూస్తూ ఉండాలా అనే అభిప్రాయం వారిలో ఉన్నట్లు తెలుస్తుంది..
ఇక సబ్బం హరి అయితే ఒక్కసారిగా జరిగిన ఈ హాఠాత్ పరిణామంతో కోలుకోలేదన్నట్లు అనిపిస్తుంది.. దాంతో నోరికి ఎదోస్తే అది మాట్లాడుతూ విషయాన్నీ ఇంకా సీరియస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తప్పని తెలిసినా. ఆక్రమించి నిర్మాణం కట్టేశారు. తీయాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అధికారులే ఆ పనికి పూనుకున్నారు. కానీ నోటీసులు ఇవ్వలేదంటూ మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నా.. కొంత మంది రాజకీయ నేతల ప్రవర్తనకు ఈ ఘటన ఉదహరణగా నిలుస్తోంది. పైగా ఆక్రమణలను తొలగిస్తున్న సిబ్బందిపై, ప్రభుత్వ పెద్దలపై రాయలేని భాషలో దూషించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
దాంతో మరిన్ని కేసులు పెట్టేందుకు యంత్రాంగం సిద్ధమయిన నేపథ్యంలో సబ్బం హరి ఇప్పుడు దిగివస్తు బేరసారాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు.. అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగడంతో నాలుక్కరుచుకున్న సబ్బం హరి.. తీరిగ్గా ఇప్పుడు మన్నించండంటూ కోరారు. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం వరకూ బాగానే ఉన్నా.. ఆయన నోటి నుంచి జారిన మాట మాత్రం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వారు సబ్బం హరి పై పెట్టాలనుకున్న కేసులు పెట్టకుండా ఉంటారా లేదా పెడతారా అన్నది చూడాలి..
చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?
చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?