Saturday, May 11, 2024
- Advertisement -

లోకేష్ కు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు.. వైసీపీ నేతల సెటైర్స్ !

- Advertisement -

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ పై వైసీపీ నేతలు చేసే విమర్శలు పోలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. లోకేష్ రాజకీయ అరగేట్రం చేసినది మొదలుకొని ఆయన భాష విధానంపై, ఆయన బాడీ లాంగ్వేజ్ పై రకరకాల విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. లోకేష్ రాజకీయాలకు పనికి రాడని, అతనొక పప్పు అంటూ రకరకాలుగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూన ఉంటారు. ఈ విమర్శల వల్ల లోకేష్ ను సీరియస్ పొలిటీషియన్ గా కాకుండా సిల్లీ పొలిటీషియన్ గా ప్రొజెక్ట్ చేయడంలో వైసీపీ నేతలుగా బాగానే సక్సస్ అయ్యారు. ఇక తాజాగా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

” విషింగ్ అమూల్ బేబీ అలియాస్ పప్పు నాయుడు.. హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ ” ట్వీట్ చేశారు. అయితే విజయ్ సాయ్ రెడ్డి చేసిన ట్వీట్ కు నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ యూ ది సేమ్ అంటూ అవంతి శ్రీనివాస్ పోటోస్ ను ఎడిట్ చేసి.. విజయ్ సాయి రెడ్డి కి కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్స్. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గతంలో పోలిస్తే లోకేష్ మాట విధానంలో చాలానే మార్పు కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం వైసీపీ పై ఘాటైన విమర్శలు చేయడంలో లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికి లోకేష్ విమర్శలను లైట్ గానే తీసుకుంటున్నారు వైసీపీ నేతలు. మరి త్వరలో పాదయాత్ర చేపట్టబోతునన్ లోకేష్.. ప్రజల్లో తనదైన ముద్ర వేస్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -