Tuesday, April 30, 2024
- Advertisement -

విశాఖ టీడీపీకి షాక్…విశాఖ పర్యటనతో లోకేష్ ఉండగానే…?

- Advertisement -

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న రోజె ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ విశాఖ కు చేరుకున్నారు.ఎవరి పుట్టినరోజు వేడుకల కోసం లోకేష్ వెళ్తున్నాడో ఆ నేత అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకీ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో పది మంది కౌన్సిలర్లుకూడా రాజీనామా చేశారు.

గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం కావడంతో అన్న పుట్టినరోజు నాడే పార్టీని వీడాలని సన్యాసి పాత్రుడు నిర్ణయించుకున్నాడు. ముప్పై ఏళ్లగా అయ్యన్నకు చేదోడువాదోడుగా ఉన్న సన్యాసి పాత్రుడు పార్టీ మారనుండడడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఈ విషయమై సన్యాసిపాత్రుడు స్పందిస్తూ.. తామంతా టీడీపీకి రాజీనామా చేశామని ధ్రువీకరించారు. తాము ఏ పార్టీలో చేరబోతున్నామో త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, సన్యాసిపాత్రుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -