Thursday, May 16, 2024
- Advertisement -

ఆ నాయకులే ఇప్పుడు చంద్రబాబు కు దిక్కయ్యరా..!!

- Advertisement -

చంద్రబాబు దేన్నైతే వద్దనుకున్నారో, ఏదైతే వెస్టు అని అనుకున్నారో, ఏదైతే పనికిరాదు అనుకున్నారో అదే ఇప్పుడు ఆయనకు వరంలా మారుతుంది.. ఎన్నికల్లో ఘోర ఓటమి తో చంద్రబాబు కు దాదాపు పోటీ చేసిన అందరు నేతలు దూరమయ్యారు. కొందరిని తిట్టి దూరం చేసుకుంటే కొందరు ఆటోమేటిక్ గా టీడీపీ పని అయిపోయిందనుకుని దూరమయిపోయారు.

ఆయనకు వచ్చిన 23 మంది ఎమ్మెల్యేలతో మాత్రమే టచ్ లో ఉంటున్నారు.. అది కూడా రెగ్యులర్ గా కాదు.. అప్పుడే ఇప్పుడో అన్నలంటూ వుంది..ఆ 23 మందిలో కూడా చాలామంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.. ఇకపోతే మొదటి శ్రేణి నేతలు ఆల్మోస్ట్ చంద్రబాబు దూరమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది.. దాంతో ఆయనకు పార్టీ లోని ద్వితీయ శ్రేణి నేతలే దిక్కయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ముఖ్యమైన నాయకులూ తాను పిలుపునిచ్చిన కార్యక్రమాలకు, వీడియో కాన్ఫిరెన్స్ లకు దూరం అవడంతో బాబు కు వీరు తప్ప వేరే వారు అండగా ఉండరని తెలిసి వారిని ఎంకరేజ్ చేస్తున్నారట..

ఇప్పటికే దీంతో తాను పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొన్న ద్వితీయ శ్రేణి నేతల పేర్లను చంద్రబాబు కేంద్ర కార్యాలయం నుంచి సేకరించారు. వారికి నేరుగా ఫోన్లు చేయడమా? లేక మెసేజ్ లు పంపడమా? లేక లేఖ రాయడమా? అన్నదానిపై ఇంకా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. నేరుగా వారికి మెసేజ్ లు పెడితే మరింత ఉత్సాహంతో పార్టీకోసం పనిచేస్తారని, మెసేజ్ లతో పాటు లెటర్ కూడా రాయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం నాడు పనికి వస్తారని భావించిన నేతలు నేడు పనికి రాకుండా పోయారు. కానీ పనికిరారన్న నేతలు ఇప్పుడు ఎలా పనికి వస్తున్నారో చూడండి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -