Sunday, April 28, 2024
- Advertisement -

రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి చుక్కెదురు.

- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. హోరా హోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం పలు చోట్ల నిలదీతలు, అడ్డగింపలు సర్వ సాధారణంగా మారిన విషయం తెలిసిందే. ఇపుడు ఆ నిరసన సెగ లు ప్రచారంలో పాల్గొంటున్న ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ కి కూడా తాకింది. ఆమెతో పాటు ప్రచారానికి వచ్చిన డికే అరుణకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో చుక్కెదురైంది.

సోమవారం డికే అరుణ తో కలిసి చిన్న కొండూరు వెళ్లిన కోమటిరెడ్డి లక్ష్మిని గ్రామస్థులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లక్ష్మి గో బ్యాక్… బిజేపి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులకు ఈ గ్రామంలోకి రావొద్దు అంటూ అడ్డుకున్నారు. గతంలో గ్రామాభివృద్ధికి ఇచ్చిన మాటలను పట్టించుకోలేదని నిలదీశారు. టీఆరెఎస్ మీద విమర్శలు చేయబోయిన డికే అరుణ పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లక్ష్మి తన ప్రచారం తూతూ మంత్రం గా చేసి వెనుతిరిగి తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -