నంద్యాల లో సమరం జోరుగా సాగుతోంది. పోటీలో ఉన్నది శిల్పా,భూమాలే అయినప్పటికి.. వైరం మాత్రం బాబు, జగన్ ల మధ్యకు వచ్చింది. అభ్యర్థులు ఓడితే పార్టీ అధ్యక్షులుగా తాము ఓడినట్లుగా భావిస్తున్నారు. విజయం ఎవరిదైన.. ఈ సమరం మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. ఉప ఎన్నికకే ఇలా ఉంటే.. రానున్న ఎన్నికల్లో మరెలా ఉంటుందో అని జనాలు ఆలోచిస్తున్నారు.
వైఎస్ జగన్.. నంద్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు అవి రసవత్తరంగా మారాయి. ఏపీలో అసలు అభివృద్ది లేదని.. కేవలం ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలకే కోట్ల నిధులు కుమ్మరించారంటు.. అధికార పార్టీ టీడీపీ పై జగన్ విరుచుకు పడ్డారు. ఇక అంతేకాకుండా.. నారా చంద్రబాబు నాయుడున్ని నడి రోడ్డుపై నిలబెట్టి కాల్చి చంపాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పేలాయి. ఈ కామెంట్స్ తో.. టీడీపీ నేతలు.. జగన్ని, వైసీపీని మరింత టార్గెట్ చేస్తున్నారు. ఇక జగన్ కొంచెం తొందర పడి ఆ మాట అనేశాడన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి స్పందించింది. చంద్రబాబును.. జగన్ కాల్చి చంపాలనడంలోఎలాంటి తప్పు లేదంటూ సమర్థించింది.
జగన్ శరీరంలోకి ఎన్టీఆర్ ఆత్మ రూపంలో ప్రవేశించి,ఆయనే ఈ వ్యాఖ్యలు చెప్పించి ఉంటాడని లక్ష్మీపార్వతి చెప్పడం విశేషం. అనవసరంగా టీడీపీ నేతలు జగన్ పై విమర్శలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది లక్ష్మీపార్వతి. అయితే తన భర్త ఎన్టీఆర్ జగన్లో ఆవరించాడని చెప్పడం.. ఎన్టీఆరే చంద్రబాబు పై కామెంట్స్ చేసేలా ప్రేరేపించాడని చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఏదేమైనా జగన్ చేసిన వ్యాఖ్యలే తప్పు అని టీడీపీ నేతలు అంటుంటే అవి సరైనవే అంటూ జగన్ ను లక్ష్మీపార్వతి వెనకేసుకొస్తుందట.