Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

- Advertisement -

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి కృష్ణాజిల్లాలో మ‌రో షాక్ త‌గిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. బాలవర్థన్‌రావుకు కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీ వ‌లె టీడీపీలో చేరిన దాస‌రి జైర‌మేష్ సోద‌రుడు. ఆయ‌న కూడా ఇటీవ‌లె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందన్నారు. ఆభ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని తొల‌గించేందుకే వైసీపీ కండువా క‌ప్పుకున్నాన‌న్నారు. వైఎస్ జగన్‌ను ఎలాంటి హామీలు కోరలేదని.. కార్యకర్తల భవిష్యత్‌ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -