Tuesday, April 30, 2024
- Advertisement -

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

- Advertisement -

ఏపీ టీడీపీలో అసంతృప్తి చల్లారడం లేదు. టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలంతా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా మరికొంతమంది రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. తాజాగా రాయచోటిలో టీడీపీ గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా సాదరంగా స్వాగతం పలికారు జగన్.

ఇప్పటికే వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో చర్చలు జరిపారు రమేష్ రెడ్డి. వైసీపీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇచ్చారు. దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తూ పార్టీలో చేరుతానని తెలిపారు.

టీడీపీలో సూట్ కేసుల్లో డబ్బు తీసుకొచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రమేశ్ రెడ్డి. కష్టపడి పనిచేసిన వారికి నిరాశే ఎదురవుతోందని ఆరోపించారు. పాతికేళ్లుగా టీడీపీ కోసం కష్టపడ్డ తనను పక్కన పెట్టడం బాధించిందన్నారు. టికెట్ల కేటాయింపులో ఏకపక్షంగా చంద్రబాబు వ్యవహరించారని…పార్టీ నాయకులే గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం జవాబుదారితనంగా ఉంటారన్నారు రమేష్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -