ఎన్నికలు దగ్గరప పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్కు పదును పెడుతున్నాయి. పలానా పార్టీలోనుంచి మాపార్టీలోకి కీలక నేతలు వలస వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం సహజం. ఒక పార్టీలోనుంచి ఇంకోపార్టీలోకి వసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రధానంగా టీడీపీనుంచి వైసీపీలోకే వలసలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పార్టీల్లో ప్రాధాన్యత లేనివారు, నాలుగు సంవత్సరాలుగా అణిగీ మణిగీ ఉన్న నాయకులు తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తాదునుకుంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అధికార పార్టీనుంచి కీలకమైన నాయకులు తర్వలో వైసీపీలో చేరుతున్నారని బాంబు పేల్చారు. పలనా నాయుకుల పేర్లను మాత్రం వెల్లడించారు.
కేలక నేతల చేరిక వల్ల అధికార తెలుగుదేశం పేక మేడలా కూలిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కీలక నాయకులు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ మునిగే పడవలాంటిదని సమయం చూసుకొని పార్టీలోకి వచ్చే నాయకుల పేర్లను వెల్లడిస్తామని అయోమంలో పెట్టారు విజయసాయిరెడ్డి. జగన్ పాదయాత్రకు పోటెత్తుతున్న జన సంద్రం కంటే వేరే సర్వే అవసరం లేదన్న ఆయన టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్ని సెటైర్లు వేశారు.
ఏపీలో మేధావులు, తతస్థులు కూడా ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. మాజీ డీజీపీ సాంబశివరావు తమ పార్టీలో చేరనున్నారని చెప్పిన ఆయన మరింతమంది మేధవులు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో టీడీపీలో అంతర్మథనం మొదలయ్యింది. వైసీపీలోకి ఎవరు వెల్తున్నారని టీడీపీ ఆరా తీస్తోంది.