పవన్ కల్యాణ్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో కూడా ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేనందున ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతలు ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్ పవన్ పార్టీలో చేరితే ఇప్పుడు టీడీపీకీ షాక్ ఇస్తూ మరో నేత జనసేన కండువా కప్పుకున్నారు.
ఇతర పార్టీల్లో ఉంటూ, ఆయా పార్టీలు మళ్లీ విజయం సాధిస్తాయనే నమ్మకం లేనివారు గానీ, లేదా, తమకు ఆయా పార్టీల్లో టికెట్ దక్కించుకుని నెగ్గగల అవకాశం లేదనే భయంతో ఉన్నవారికి మాత్రమే అలాంటివారు మాత్రమే ప్రస్తుతం జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారు.
తిరుపతికి చెందిన ప్రముఖ బలిజ నాయకుడు మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబు జమానాలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా కూడా సేవలందించిన చదలవాడ కృష్ణమూర్తి.. జనసేన పార్టీలో చేరారు.పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నిజానికి ఆయన జనసేనలో చేరడానికి సంబంధించించాన్నాళ్ల కిందటే రంగం సిద్ధం అయింది. అయితే మంచి ముహూర్తం కోసం ఆగిన చదలవాడ.. తాజాగా విజజయదశమి పర్వదినం రోజున వచ్చి పార్టీలో చేరారు. చదలవాడ చేరిక కూడా జనసేన పార్టీకి చాలా అదనపు బలం అని ఆ పార్టీ భావిస్తోంది.
చేరికలతో పార్టీ నేతలు కుషిగా ఉన్నా..అసలు ఆయా నాయకుల ఒరిజినల్ బలాబలాలు ఎంత? అనేది వారే ఓసారి సమీక్షించుకోవాల్సి ఉంది. చదలవాడకు తిరుపతిలో సొంత కరిష్మాతో నెగ్గగల స్థాయి ఉందా? అనేది ప్రశ్నార్థకం.తెలుగుదేశం రాజకీయాల్లో తనకు టికెట్ వచ్చే చాన్స్ లేదు గనుక మాత్రమే ఆయన ఇటు వచ్చి చేరారు. అదే సమయంలో.. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ తరఫున గెలిచేంత సీన్ లేక, తెదేపా, వైకాపాలలో తనకు ఎంట్రీ దొరక్క జనసేనను ఎంచుకున్నారు.