గుంటూరు జిల్లాలో టీడీపీకీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. భాజాపా అపరేషన్ ఆకర్ష్కు ఆ పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం పార్టీలోకి వెల్లేందుకు నేతలు క్యూలో ఉన్నారు. ఓ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. బీజేపీ.. ఆపరేషన్ కమల్ దెబ్బకు ఆ పార్టీ ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనం అయ్యింది.
తాజాగా గుంటూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కీలక నేత రాయపాటి సాంబిశివరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. తాను త్వరలోనే బీజేపీలో చేరతానని స్వయంగా ప్రకటించారు. గుంటూరులో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రాయపాటి పార్టీని వీడుతుండటం పెద్ద దెబ్బే. తాను బీజపీ పెద్దలెవరితో సంప్రదింపులు జరపలేదని చెబుతూనే… ఆ పార్టీలో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు.
గతంలో టీటీడీ ఛైర్మెన్ పదవిపై ఆశ పెట్టుకునకు అనూహ్యంగా బాబు హ్యాండ్ ఇచ్చారు. ఆ పదవి పుట్టా సుధార్ యాదవ్కు కట్టబెట్టారు. అప్పటినుంచి రాయపాటి గుర్రుగా ఉన్నారు. సరైన సమయం చూసి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
రాయపాటిని బీజేపీలో చేర్చుకునేందుకు ఇటీవల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మూడు రోజుల క్రితం రాయపాటి నివాసానికి వచ్చి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని బీజేపీ భావిస్తోంది.