Monday, April 29, 2024
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు….

- Advertisement -

జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్ర‌జా స్పంద‌న రావ‌డంతో పాటు పార్టీలో వ‌ల‌స‌లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే అనేక మంది టీడీపీ నేత‌లు వైసీపీ ఖండువా క‌ప్పుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అనంతపురం అర్భన్ నియోజవర్గ టీడీపీ నేత లింగాల రమేష్ సహా 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్ టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన గురునాధ్‌రెడ్డి టీడీపీలో చేరిన సంగ‌తి తెల‌సిందే. వీరి చేరిక‌తో వైసీపీ బ‌లోపేతం కానుంది.

ఇటీవ‌లే గుంటూరు జిల్లాలోకూడా పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావులు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే. పాద‌యాత్ర పూర్త‌య్యోలోపు పార్టీలోకి ఇంకెన్ని వ‌ల‌స‌లు ఉంటాయోన‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -