తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ జరుగుతోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించారు.దీంతో టీఆర్ఎస్ నాయకులు తమ నామినేటేడ్ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మహూకూటమి అభ్యర్తి టీడీపీ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య కూడా ముదు జాగ్రత్తో తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నుంచి తప్పుకున్నారు. ఇప్పుటివరకూ పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవికి రాజీనామా చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ తెలుగు దేశం లో కీలక నాయకుడైన సండ్ర వెంకట వీరయ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపత్తి నియోజకవర్గం నుండి ఫోటీ చేస్తున్నారు. టీటీడీలో సభ్యుడిగా ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.