Sunday, May 19, 2024
- Advertisement -

వైసీపీ ప‌గ‌లు సంసారం…రాత్రి చేసేది రాజ‌కీయ‌ వ్య‌పిచారం..ధూలిపాళ్ల న‌రేంద్ర‌

- Advertisement -

కేంద్రం అవిశ్వాస తీర్మానం నేప‌థ్య‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే బాబుపై విజ‌య‌సాయి చేసిన వ్యాఖ్య‌ల‌పై అనేక మంది టీడీపీ నేత‌లు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ధూలి పాళ్ల‌న‌రేంద్ర వైసీపీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

పగలు సంసారం చేస్తూ, రాత్రి రాజకీయ వ్యభిచారం చేయడం ఆ పార్టీ నేతల నైజమని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చీటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయసాయి… ఆ సభకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సంస్కార హీనంగా మాట్లాడుతూ, రాజ్యసభ గౌరవాన్ని దిగజార్చుతున్నారని అన్నారు. ప్రధాని కాళ్లకు మొక్కడం ద్వారా ఆయన తన అసలు నైజాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -