Saturday, April 27, 2024
- Advertisement -

బాబుకు పెద్ద షాక్.. వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

- Advertisement -

రోజు రోజుకి టీడీపీకి ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుగుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముందు సీనియర్లు జంప్ అవుతుంటే తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు. గెలిచిందే 23మందిలో నలుగురు ఇప్పటికే వైసీపీలోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే బాటలో వెళ్లేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ జంప్ కొట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గంటా శ్రీనివాసరావు ఈ నెల 3న సీఎం జగన్ ని కలబోతున్నట్లు విశాఖలో టాక్ నడుస్తోంది. ఆ రోజు కుమారుడితో కలిసి ముఖ్యమంత్రిని కలిసి.. కుమారుడికి అధికార పార్టీ కండువా కప్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గంటా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల బాటలోనే నడవనున్నారట. కేవలం సీఎంకు తన మద్దతు తెలపాలనుకుంటున్నారట. అయితే గంటా నుంచి మాత్రం ఏ అధికారిక ప్రకటన రాలేదు.

గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే అధికార పార్టీ వైసీపీలోకి జంప్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం పార్టీ మారనని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ పార్టీ మార్పుపై స్పందించలేదు. చాలా రోజులుగా ఆయన అధికార పార్టీ వైపు చూస్తున్నారని చర్చ జరుగుతూనే ఉంది. రెండు వారాల క్రితమే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి.. కుమారుల్ని వైఎస్సార్‌సీపీలో చేర్చారు. గంటా కూడా అదే బాటలో వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ కి చెక్ పెట్టేవిధంగా బీజేపీ సరికొత్త ప్లాన్స్..!!

దుబ్బాక లో దుమ్ము రేపడానికి అన్ని పార్టీ లు సిద్ధం..

ఘోరమైన చెత్త రికార్డు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..?

సోము వారికి చుక్కలు చూపిస్తున్నాడుగా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -