Friday, March 29, 2024
- Advertisement -

రోజా తాగొచ్చి మాట్లాడుతున్నారు ..టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంక‌న్న

- Advertisement -

వైసీపీపై, ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా, రోజాపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. దాచేపల్లి ఘటనపై స్పందించిన రోజా.. ఆయేషా మీరా హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విజయవాడలో రోజా అడుగుపెడితే అడ్డుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ సంచరిస్తోందని, ఆ గ్యాంగ్ పట్టపగలు రోడ్లపై తిరిగి రాత్రికి దోచుకుపోతారని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా పట్టపగలే మద్యం తాగి మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి అడ్డగోలుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రోజా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమెను పరీక్షిస్తే మద్యం తాగినట్టు రుజువౌతోందన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు నీతులు చెప్పే హక్కు లేదన్నారు. రోజా ఇవాళ నీతులు చెబుతోంటే తమకు బూతుల మాదిరిగా విన్పిస్తున్నాయని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. రోజా చేసే విమర్శలపై విజయవాడలో మహిళలు ఆమెను తరిమికొడతారని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -