అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటి దూల అందరికి తెలిసిందే. ఏ విషయంలోనైనా కుండబద్దులు కొట్టి మాట్లాడతాడు. రాజకీయ ప్రత్యర్థులపై చేసి విమర్శలు సంచలనంగా ఉంటాయి. విపక్షమైనా, స్వపక్షమైనా అన్నది తేడా లేకుండా రెచ్చిపోతుంటారు.
ఇక జనగ్పై జగన్ పై ఒంటికాలి మీద లేచే టీడీపీ లీడర్ ఎవరంటే.. దివాకర్ రెడ్డి. జగన్ను అనడం వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జగన్ ని ‘వాడు..’ అని సంబోధించడం జేసీకి అలవాటు. రాజకీయ నేత అన్నాక కొంత డిప్లొమాటిక్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యర్థిని కూడా గౌరవించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే జేసీ మాత్రం ఇలాంటి ప్రొటోకాల్స్ ఏమీ పట్టించుకోరు.
ప్రత్యేకించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విషయంలో అయితే ఎంత మాటైనా సరే అలవోకగా అనేస్తారు. జగన్ విషయంలో దివాకర్ రెడ్డి నోటి దూలపై జేసీ స్పందించారు. తను జగన్ ను ‘వాడు’ అనడంలో ఆయన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదని జేసీ స్పష్టం చేశారు. జగన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. అప్పట్లో రేయ్..అనే వాళ్లం.. ఇప్పుడు కొత్తగా ‘సార్’ అనడం ఇబ్బందిగా ఉంటుందంటారు. జగన్ను వాడు అనడం వెనుక వాత్సల్యం తప్ప అగైరవ పరిచే ఉద్దేశ్యం లేదని జేసీ తన మనసులో మాట బయట పెట్టారు.