టీడీపీలోని ప్రధాన నేతల మధ్య పోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో ఓటమితో టీడీపీ కుదేలయ్యింది. పార్టీ భవిష్యత్తుపై నానా తంటాలు పడుతున్న బాబుకు ఇప్పుడు ఇంటిపోరు నిద్రలేకుండా చేస్తోంది. పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో ముఖ్య నాయకులు భాజాపాలో చేరుతున్నారు. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో తెలియక బాబు పార్టీ మారకుండా నేతలను ఆపాలని చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళెవరూ ఆగటం లేదు. ఒకవైపు వలసలతో చంద్రబాబు ఇబ్బంది పడుతుంటే మరోవైపు నేతల మధ్య వివాదాలు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారిపోతోంది చంద్రబాబు పరిస్ధితి.
పార్టీలోని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ల మధ్య ట్విట్టర్ వార్ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. వారు చేసిన తప్పులు వారే బయటక పెట్టుకుంటున్నారు. నువ్వు దొంగంటే కాదు నువ్వే కాల్ మనీ సెక్స్ రాకెట్ లో బ్రోకరవి….అంటూ టిడిపి నేతలు ఒకళ్ళ వ్యవహారం మరొకళ్ళు బయట పెట్టేసుకుంటున్నారు. ర్టీకి ఆయువు పట్టులాంటి కృష్ణా జిల్లాలో మొదలైన ముసలం తారాస్థాయికి చేరింది.
ఎంఎల్సీ బుద్ధా వెంకన్న-ఎంపి కేశినేని నాని వ్యవహారం శృతిమించి రోడ్డున పడింది. తాజాగా ఎంపి ట్వీట్ చూస్తుంటే ఏకంగా చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇస్తున్నట్లే ఉంది. ఆ వార్ లో బుద్ధా ధాటికి తట్టుకోలేకే నాని రాజీనామా అస్త్రాన్ని చంద్రబాబు మీదకు సంధించినట్లు అర్ధమవుతోంది.
నిన్నటి వరకు ట్వీట్లతోనె సరిపెట్టిన నాని ఇప్పుడు… ఏకంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు గారూ… నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తన లాంటివాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను నియంత్రంచిండని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.