గత కొద్ది రోజులుగు టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్లతో దూసుకుపోతున్నారు. రాజకీయ నేతలతో పాటు…ప్రజాసమస్యలపై కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. సొంత పార్టీ నేతలనె టార్గెట్ చేసిన నాని ఇప్పుడు డీజీపీ, జగన్ల పై ట్వీట్లు మొదలు పెట్టారు.
ఇటీవలే ఓ రోడ్డు ధ్వంసమయ్యిందని.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మరో కీలకమైన విషయాన్ని ముఖ్యమంత్రితో పాటూ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీలో సంచలనంగా మారిన కాల్మనీ రాకెట్పై కేశినేని నాని ట్వీట్ చేశారు.
‘‘ డీజీపీ గారు కాల్ మనీ మాఫియా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. కాల్ మనీ మాఫియా బారిన పెద్ద ప్రజలు పడకుండా కాపాడండి సార్’ అంటూ పోస్టు చేశారు. డీజీపీతో పాటు సీఎం జగన్కు కూడా ట్వీట్ కు ట్యాగ్ చేశారు .
విజయవాడ, కృష్ణాజిల్లాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. టీడీపీ నేతలపైనె ప్రధానంగా విమర్శలు వచ్చాయి. కేశినేని నాని ఈ మధ్యే సొంత పార్టీకి చెందిన నేతపైనా ఆరోపణలు చేశారు. తాజాగా మళ్లీ ఈ వ్యవహారంపై ఆయన ట్వీట్ చేయడం టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారింది