Sunday, May 5, 2024
- Advertisement -

వైసీపీనీ పొగిడిన టీడీపీ ఎంపీ…

- Advertisement -

ప్రతిపక్ష పార్టీని, ఆ పార్టీ నేతలని అధికార పార్టీ నేతలు పొగడటం గురించి ఎప్పుడైనా విన్నారా..? అది జరిగే ప్రసక్తే లేదు అనుకుంటున్నారా..? కానీ అదే జరిగింది. వైసీపీ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పొగడ్తల వర్షం కురిపించారు

భయంకర తిత్లీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు తీరని నష్టం మిగిల్చింది. తిత్లీ తుఫాన్ కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు నడుం బిగించి తమవంతుగా సాయం చేస్తున్నారు. సినీ హీరోలు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

ఇదే క్ర‌మంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ సైతం కోటి రూపాయలను తిత్లీ బాధితుల సహాయార్థం విరాళంగా ఇచ్చింది. అయితే వైసీపీ సాయాన్ని కొనియాడుతూ శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన వైసీపీ‌ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లోనే పార్టీ సరిహద్దులు దాటి మనం పనిచేయాలని, ప్రజలకు సేవ చేయాలని వెల్లడించారు.

https://twitter.com/RamMNK/status/1052099466604335104

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -