Wednesday, May 8, 2024
- Advertisement -

టీడీపీ నేత కారు పై వైసీపీ నేతల విధ్వంసం..?

- Advertisement -

రాష్ట్రంలో అవినీతి లో ఉన్న టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని అందరికి తెలుస్తున్న విషయమే..  మొదట అచ్చెన్నా, ఆ తర్వాత కొల్లు రవీంద్ర , జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సబ్బం హరి ఇలా టీడీపీ ప్రధానంగా ఉన్న నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తూ వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ.. అయితే వాటిలో అవాస్తవం కంటే వాస్తవం ఎక్కువ గా ఉండడంతో టీడీపీ వారిని వెనుకేసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.. తమ నేతలు నీతి పరులు అని చెప్పడానికి తెగ ఆరాటపడుతుంది..

ఇక ఇటీవలే సబ్బం హరి ఇంటిలోని కొంత అక్రమంగా ఉన్న కట్టడాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.. అయితే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేక కార్యాలపాలు చేస్తున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.. యాధృచ్చికంగా జరిగిపోతున్నాయని.. తమకేం సంబంధం లేదని అధికార పార్టీ నేతలు చెబుతూ ఉన్నా టీడీపీ వారు దానిని నమ్మట్లేదు.. జగన్‌కు వ్యతిరేకంగా.. ఆయన పాలనా తీరుకు వ్యతిరేకంగా గట్టి వాయిస్ వినిపిస్తున్న సబ్బంహరి ఇంటి గోడను.. నాలుగు వందల మందిని తీసుకు వచ్చి .. విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. విశాఖలో మిగిలిన ఆక్రమణ అదొక్కటే కాదు. కొన్ని లక్షల ఆక్రమణలు ఉన్నాయి. పైగా ఆ విషయంలో తన వద్ద పత్రాలున్నాయని సబ్బం హరి చెబుతూనే ఉన్నారు. ఆ గోడ నిర్మాణానికి సంబంధించిన రాజకీయ ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి.

ఇక తాజాగా టీడీపీ నేత అయిన పట్టాభికి చెందిన కారుపై అర్థరాత్రి దుండగులు దాడి చేశారు. పెద్ద పెద్దరాళ్లతో అద్దాలను ధ్వంసం చేసి వెళ్లారు. పట్టాభి ఇటీవలి కాలంలో టీడీపీ అధికార ప్రతినిధిగా వైసీపీపై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఘాటుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ టైం లో ఆయనపై జరిగిన ఈ దాడిని అధికార పార్టీ చేయించిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగానే పోలీసులు హుటాహుటిన వచ్చి… పగిలిపోయిన అద్దం కొలతలు.. ఏ రాళ్లు పెట్టి పగలకొట్టారో ఆ రాళ్ల కొలతలు తీసుకుని వెళ్లారు. చీటికీ మాటికీ జగన్ మీద నోరుపారేసుకునే చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం ఎంతవరకు వెళ్తుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -