Monday, May 6, 2024
- Advertisement -

జ‌గ‌న్‌మీద కోడిగుడ్ల‌ దాడి..

- Advertisement -

నంద్యాల‌లో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం యుద్దాన్ని త‌ల‌పిస్తోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, స‌వాల్లు,ప్ర‌తి స‌వాల్ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు తారాస్థాయికి చేరాయి. మూడ‌వ తేదీన నంద్యాల‌లో వైసీపీ బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్ బాబుపై చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.టీడీపీ న‌తేలు అంతె స్థాయిలో జ‌గ‌న్‌ను టార్గెట్ చేశారు.

చంద్రబాబునాయుడిని న‌డిరోడ్డుమీద కాల్సి చంపాల‌ని చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తీవ్ర నిర‌స‌న‌లు తెలిపింది.జ‌గ‌న్ దిస్టిబొమ్మ‌ను ద‌గ్దం చేశారు. అయితె నెల్లూరులో మాత్రం విచిత్రంగా నిర‌స‌న తెలిపారు.జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు, నేతలు నుడా చైర్మన్ కోటం రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపి తమ కసి తీర్చుకున్నారు.

ఒక వ్యక్తికి జగన్ వేషం వేసి నిలబెట్టారు. ఆయన మీదకు కోడిగుడ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. జగన్ గత వారంలో జగన్ నంద్యాలలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ను రోడ్డుమీద నిలబెట్టి కాల్చినా పాపం లేదు అన్ని అన్నాడని, అందుకే దీనికి ఈ విధంగా నిరసన తెలుపుతున్నామని టిడిపి నేతలు చెప్పారు.

ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టాభివ్రుద్దికోసం అహర్నిశలు క్రుషి చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని కాల్చేయాలనడం ఆయన నేర ప్రవృతకి నిదర్శమన్నారు. బజారు రౌడీలు అంతిమంగా జనంచేతిలో ఇలా తన్నులు తింటారని ఆయన అన్కారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -