అధికార టీడీపీపై భాజాపా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మరో బాంబు పేల్చారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు.
టీడీపీ పని అయిపోయిందని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని.. మే 15వ తేదీకి తర్వాత అన్నీ విషయాలను బహిర్గతమనవుతాయని తెలిపారు. దమ్ముంటే కేసులు పెట్టాలంటూ కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని… త్వరలోనే వారి కోరిక తీరుస్తామన్నారు.
రూ. 9,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని… కానీ, టీడీపీ ప్రభుత్వం తీసుకోవడం లేదని విష్ణు కుమార్ రాజు విమర్శించారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నాక… తన మామగారి కోసం ఆయనను కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.