చంద్రబాబుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో కేసీఆర్ బాబుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాబు టార్గెట్గా చెలరేగారు. ఎన్నికల ముందు శారదాపీఠం స్వామీజీ వచ్చి రాజశ్యామల యాగం చేసి వెళ్లారు. గెలిచాక మఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లమని దాన్ని కూడా బాబు రాజకీయం చేశారన్నారు.
వైజాగ్లోని మఠానికి వెళ్లాను. వేలాది మంది ప్రజలు ఘనస్వాగతం పలికారని చెప్పారన్నారు. ఒక పత్రిక వాళ్లేమో వైకాపా హడావుడి అని, మరో పేపరేమో వెలమల హడావుడి అని రాశాయని ధ్వజమెత్తారు. మా దగ్గర బాబును ఘోరంగా ఓడిస్తామని నాతో చెప్పారన్నారు. అందుకే నేను వెళ్లినప్పుడు ప్రజల్లో ఉత్సాహం కనిపించింద’ని కేసీఆర్ చెప్పారు
బాబుకు తానిచ్చే రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుందన్నారు. చంద్రబాబు లీడర్ కాడని.. మేనేజర్ మాత్రమేనన్నారు. ఏపీలో చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని.. ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదన్నారు. ఏపీలో ప్రతిపక్షం సరిగా పని చేయడం లేదు. ఇక నుంచి చంద్రబాబును మేం తగులుకుంటామని కేసీఆర్ చెప్పారు. బాబు కేసీఆర్ ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ ఓటమేనా…?