Saturday, May 11, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు సీట్లు గెలిచే స‌త్తా లేదా?

- Advertisement -

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రానున్నఎన్నిక‌ల‌లో ఘోర ఓట‌మి త‌ప్ప‌ద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో కేవలం ఓట్లు మాత్రమే చీల్చగలదని తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. జ‌న‌సేన‌కు పెద్ద‌గా సీట్లు వ‌చ్చే చాన్స్ కూడా లేద‌ని ఆయ‌న తెలిపారు. ప‌వ‌న్ ప్ర‌భావం రెండు మూడు జిల్లాలోనే ఉంటుంద‌ని, అది కూడా యూత్‌లోనే ప‌వ‌న్ హ‌వ ఉంటుంద‌ని టీజీ చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా హోదా విషయంలో తెలుగు ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. హోదా ఇస్తే టిడిపి పార్టీ బలపడుతుందనే ఇవ్వడం లేదన్న టీజీ వెంకటేశ్ తెలిపారు. 2019 ఎలెక్ష‌న్స్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావ‌డం ఖాయం అని టీజీ జోస్యం చేప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -