Friday, May 3, 2024
- Advertisement -

టిడిపి ఎమ్మెల్యే హత్య…….లోకేష్‌తో సహా అందరి అక్రమాలు బయటపెట్టించిన మావోలు

- Advertisement -

ఏం చేసినా……….ఎన్ని తప్పులు చేసినా మీడియాతో మేనేజ్ చేయగలం, వ్యవస్థలను మేనేజ్ చేయగలం అని రెచ్చిపోయిన టిడిపి నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. కలలో కూడా ఊహించని ముప్పు పొంచుకొచ్చింది. 2004లో అధికారం పోవడానికి ఒక కారణమైన మావోయిస్టుల ఫ్యాక్టర్ ఇప్పుడు మళ్ళీ ప్రధానాంశంగా మారనుంది. టిడిపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన తర్వాత నుంచీ ఏజెన్సీలో టిడిపి నేతల పాపాలను దాచిపెట్టడానికి పచ్చ మీడియా మొత్తం శతధా ప్రయత్నిస్తోంది కానీ మావోయిస్టులు మాత్రం ఈ ఎల్లో ప్రచారానికి కౌంటర్ కూడా రెడీ చేశారని తెలుస్తోంది.
కిడారిని హత్య చేస్తున్న సమయంలోనే స్థానిక గిరుజనుల సమక్షంలోనే కిడారి చేత నిజాలు చెప్పించారు మావోయిస్టులు. కిడారి కూడా గిరజనుడే అయినందున భవిష్యత్తులో గిరిజనులు ఎదురుతిరుగుతారేమో అన్న భయంతో కిడారి చేసిన తప్పులను బహిరంగంగా చెప్పించారు. పార్టీ మారినందుకు 12 కోట్లు ఇచ్చారని ప్రజల సమక్షంలోనే చెప్పాడు కిడారి. అలాగే గిరిజన కోటాలో మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారట. అన్నింటికీ మించి మైనింగ్ లైసెన్సులన్నీ లోకేష్‌నే ఇప్పిస్తున్నాడని…….మైనింగ్ అక్రమాల విషయంలో అన్నీ లోకేషే చూసుకుంటున్నాడని కిడారి చెప్పిన మాటలు ఇప్పుడు మావోయిస్టుల దగ్గర ఉన్న వీడియోల్లో రికార్డ్ అయి ఉన్నాయి.

మావోయిస్టులపై కూడా ఒక వర్గం మీడియా పూర్తిగా వ్యతిరేక ప్రచారం చేస్తుందన్న అవగాహన ఉన్న మావోలు త్వరలోనే టిడిపి అవినీతి, అక్రమాలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి అవినీతిపై కాగ్‌తో సహా స్వచ్ఛంధ సంస్థలు, ప్రతిపక్ష, విపక్ష నాయకులందరూ విమర్శలు చేస్తున్నారు. ఇక ససాక్ష్యాలతో మావోయిస్టులు రిలీజ్ చేయబోయే వీడియోలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే మావోయిస్టులు రిలీజ్ చేయబోయే వీడియోలు, పాంప్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. టిడిపి అవినీతి వ్యవహారాలు వీడియో సాక్ష్యాలతో బయటపెడతామంటున్న మావోయిస్టు వ్యూహాలను అధికార పార్టీనేతలు ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -