Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీకీ సినీ ఇండ‌స్ట్రీ నుంచి పెరుగుతున్న మ‌ద్ద‌తు..

- Advertisement -

వైసీపీకీ రోజు రోజుకీ సినీ ఇండ‌స్ట్రీనుంచి మ‌ద్దుతు ల‌భ‌స్తోంది. ఇప్పటికే పలువురు సినీ నటులైన పోసాని కృష్ణమురళీ, పృథ్వీ, చోటా కే నాయుడు తదితరులు జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు. తాజాగా మ‌రో సినీ న‌టుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కొన్ని చిత్రాల్లో హీరోగా, ఎన్నో చిత్రాల్లో కమేడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు కృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుండగా, కత్తిపూడిలో జగన్ ను కలిసిన కృష్ణుడు, ఆయన చేతుల మీదుగా పార్టీ కండువాను కప్పుకున్నారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్‌.

జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్న జగన్ ను అభినందించినట్టు కృష్ణుడు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -