- Advertisement -
ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు జగన్ ను నుటార్గెట్ చేయడం మొదలు పెట్టారు. సీఎం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదలా ఉంటె రాజధానిపై మరో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు.
బొత్స చేసిన వ్యాఖ్యలు ఓ వైపు ప్రకంపనలు సృష్టిస్తుండగానే… వివాదానికి మరింత ఆజ్యం పోశారు మరో మంత్రి అవంతి శ్రీనివాస్. అమరావతిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని తెలిపారు.