తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టికెట్లు రాని నేతలు మాత్రం పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి రాజయ్యకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆయనకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. వరంగల్ లో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్టేషన్ ఘణపూర్ టికెట్ రాజయ్యకి కాకుండా కడియం శ్రీహరి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజయ్య తప్ప ఇక్కడ ఎవరు పోటీచేసినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. గత ఐదేళ్లలో కడియం శ్రీహరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ, ఆయనకే మరోసారి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. అవినీతి, రాసలీలలకు కేరాఫ్ గా మారిన రాజయ్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు
ఇటీవల తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. తమ పార్టీ తరపు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో రాజయ్య పేరు కూడా ఉంది. అయితే.. రాజయ్య ఇతర మహిళలతో స్త్రీలో రాసలీలలు ఆడాడని.. ఇటీవల ఆడియో టేపులు విడుదలయ్యాయి. దీంతో.. ఆయనకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. రాజయ్యకు ఇచ్చిన టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.