టీఆర్ ఎస్ అభ్యర్తులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా అక్కడక్కడా చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. నేతలను నియోజక వర్గ ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ను ఓ మహిళ నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది.
నియోజకవర్గంలో ఈరోజు గోపీనాథ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఓట్ల అడగటానికి బుద్ధిలేదా అంటూ తాజా మాజీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళ మండిపడ్డారు. ఓ సమస్యను పరిష్కరించాలని తన భర్త మిమ్మల్ని చాలాసార్లు కలిశారని… అయినా మీరు పట్టించుకోలేదని… ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారని గోపీనాథ్ ను ఓ మహిళ కడిగి పారేసింది.
కళ్యాణ్ నగర్ స్థల వివాదం విషయమై ఏం పరిష్కరించారని స్థల యజమాని అనంతనాగ్ భార్య టీఆర్ఎస్ నేతను నిలదీశారు. మా సమస్యను ఏం పరిష్కారం చేశారని మహిళ అడిగితే.. రోడ్డుమీద కాదు తర్వాత మాట్లాడదం అని గోపీనాథ్ అన్నారు. తమాషా చేస్తున్నారా.. బుద్ధిలేదా ఓట్లు అడిగేందుకు వచ్చావ్ అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమి లేక గోపీనాథ్ అక్కడ నుంచి వెనుతిరగారు.