తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్నుండి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ దంపుతులు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా రాముల నాయక్, నర్సారెడ్డి రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
గత కొంత కాలంగా డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. ఆయన కూడా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారనే వార్తలపై ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన డీఎస్… అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే తన రాజ్యసభ పదవికి ముప్పు తప్పదని భావించిన డీఎస్… తాను పార్టీ మారాననే విషయాన్ని వెల్లడించలేదు. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
డీఎస్, రాములు నాయక్, నర్సారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను మహాకూటమి మట్టికరిపిస్తుందని జోస్యం చెప్పారు.