పాదయాత్రలో జగన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలనుంచి ఊహించని విధంగా మద్దతు వస్తోంది. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డిపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మాట ఇస్తే దానిపైనే నిలబడే వ్యక్తని…. ఆయన పోలికలే వైఎస్ జగన్ కూ వచ్చాయన్నారు. జగన్ ఏదైనా చెబితే చేసి తీరుతారని అన్నారు. వైఎస్ కు ఉన్న ఆ గుణమే, ఆయన్ను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపిందని తెలిపారు.
పాదయాత్ర ప్రారంభించిన తరువాత, జగన్ కు ప్రజా మద్దతు అనూహ్యంగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డ ఆయన, సీఎం పదవిని చేపట్టేందుకు జగన్ కు పూర్తి అర్హతలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా కీలకమైన ఏ ఒక్క విభజన హామీనీ ఆయన సాధించలేక పోయారని విమర్శలు గుప్పించారు.
భాజాపాతో పొత్తుపెట్టుకొని బాబు ఏపీకీ ముఖ్యమైన ప్రత్యేకహోదాను సాధించలేక చితికలబడ్డారన్నారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ సహా ఎన్నో కీలక హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా, చంద్రబాబు కిక్కురుమనడం లేదని నిప్పులు చెరిగారు.