అక్రమ కట్టడాలపై అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధానంగా కరకట్టమీద ఉన్న చంద్రబాబు నివాసం లింగమనేని గెస్ట్ గౌస్పై వాడి వేడి చర్చ జరిగింది. అక్రమ కట్టడాల వల్ల నది తన మార్గాన్ని మార్చుకుంటె దాని ప్రభావం వల్ల వరదలు వచ్చే ప్రమాదముందని జగన్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని బాబు ఒప్పుకొన్నారు.
అధికారంలో ఉన్నవారికి, ప్రతిపక్షంలో ఉన్నవారికి వేరే విధంగా నియమాలు ఉండవని అవి సామాన్యేలకైనా ఎంతటి వారికైనా ఒకటేనని వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో లెక్కా? అని పేదలు, తీర ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారిలో తీవ్ర భయాందోళనలను పెంచుతున్నారని మండిపడ్డారు బాబు.
ప్రజావేదిక కూల్చివేతను ప్రస్తావిస్తూ, అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను ఓ తప్పు చేశానని, ప్రజా వేదికను తమకు కేటాయించాలని కోరడం తప్పయి పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక భవనాన్ని తనకు కేటాయించాలని తాను లేఖ రాయకుండా ఉండుంటె ప్రజావేదిక కూల్చేవారు కాదన్నారు.