Monday, May 6, 2024
- Advertisement -

సడెన్ గా విశాఖ పై జగన్ కు అంత ప్రేమ ఎందుకొచ్చింది…!!

- Advertisement -

వైఎస్ జగన్ ఏది చేసినా సంచలనమే.. ఎన్నో ఆపసోపాలు పడి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా జగన్ చంద్రబాబు చేసిన అసమర్థ పనిని దేనిని ఓ పట్టాన ఉంచట్లేదు.. అందుకు సాక్ష్యం చంద్రబాబు రాజధాని గా నిర్ణయించిన అమరావతి..రాజధాని పనులు ఎక్కడివక్కడే ఉండడంతో అంత టైం ఉన్న ఎందుకు పూర్తి స్థాయి రాజధాని గా మార్చలేదని ప్రజలు చంద్రబాబు ను తిట్టిపోస్తున్నారు.. దాంతో జగన్ ఆ శాపనార్థాలు తనకు వద్దనుకున్నాడో ఏమో వెంటనే రాజధాని విశాఖ కి షిఫ్ట్ చేశారు..

అయితే రాజధాని ని ఎందుకు విశాఖ కే షిఫ్ట్ చేశారు..ఇంకో చోటికి ఎందుకు మార్చలేదు. పైగా జగన్ కు విశాఖ తో చాల చేదు అనుభవాలే ఉన్నాయి.. అయన తల్లి విజయమ్మ ని దారుణంగా ఓటమి పాలు చేసిన ప్రాంతం అది.. మొన్నటి ఎన్నికల్లో కూడా జగన్ ప్రభంజనం అంత ఉన్నా విశాఖ లో వైసీపీ బలంగా కూడా లేదు అలాంటిది విశాఖ కే ఎందుకు మార్చారన్నది కొంతమంది ప్రశ్న.. అయితే దానికి సమాధానంగా వైసీపీ వర్గాలు ఇలా అంటున్నాయి..

అమరావతి పేరిట చంద్రబాబు భారీ కాన్వాస్ మీద చిన్న బొమ్మ గీసి పెట్టి వెళ్లారు. ఆ కాన్వాస్ సరిపడా బొమ్మ గీయాలంటే జగన్ దగ్గరున్న రంగులు హంగులూ ఏ మాత్రం సరిపోవు. మరో వైపు దిగిపోయిన చంద్రబాబు నుంచి అమరావతి రాజధాని మీద గట్టిగానే వత్తిడి ఉంటుంది. ఇంకో వైపు అంత డబ్బు అప్పు తెచ్చినా లేక ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టినా కూడా చిల్లు కుండ లాంటి అమరావతి ప్రాజెక్ట్ ఎప్పటికీ నిండదు, జగన్ చేతిలో ఉన్న బంగారు లాంటి అయిదేళ్ల కాలం ఇట్టే అయిపోతుంది. అటు అమరావతి పూర్తి చేయలేని అసమర్ధుడిగా, ఇటు మిగిలిన ప్రాంతాల నోట్లో మట్టి కొట్టిన అన్యాయస్థుడిగా జగన్ ముద్ర పడతారు. అందుకే జగన్ కు అప్పటికే రెడీమేడ్ గా అన్ని వసతులతో ఉన్న నగరం కొరకు చూశారు.. ఆ పరిస్థితుల్లో జగన్ కి విశాఖ కళ్ల ముందు కనిపించింది. రెడీ మేడ్ సిటీగా ఉన్న ఈ నగరాన్ని కొంచెం నిధులతో అభివ్రుద్ధి చేసుకుంటే చాలా తొందరలో అంటే తన పదవీకాలం ఉండగానే ఎంతో కొంత ప్రగతిని జనాలకు చూపించవచ్చు అని జగన్ విశాఖ ని రాజధాని గా ఎంచుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -