Tuesday, May 28, 2024
- Advertisement -

బూచెప‌ల్లి నాఆప్తుడు, స్నేహితుడు: జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లా ద‌ర్శినియోజ‌క వ‌ర్గంలో కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ ఇప్ప‌టినుంచే పార్టీని సిద్ధం చేస్తున్నారు. అన్ని పార్టీల‌కు షాక్ ఇస్తూ పాద‌యాత్ర‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ముఖ్య‌మైన నియోజ‌క వ‌ర్గాల్లో ఇప్ప‌టినుంచే పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తూ సంల‌చ‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే పాదయాత్ర‌లో ప‌త్తికొండ‌, క‌ప్పం నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌క‌శం జిల్లా ద‌ర్శినియోజ‌క వ‌ర్గం అభ్య‌ర్తిని ప్ర‌క‌టించారు. ద‌ర్శిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ‌స‌భ‌లో 2019 ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్తిగా బాదం మాధ‌వ్‌రెడ్డిన‌ప్ర‌క‌టించారు.

బూచెప‌ల్లి శివ‌ప్ర‌సాద్ జ‌గ‌న్‌కు అత్య‌తంత మిత్రుడు. వైసీపీ త‌రుపున 2014 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శివ‌ప్ర‌సాద్ గ‌త కొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీత‌రుపున పోటీచేయాల‌ని జ‌గ‌న్ కోరినా శివ‌ప్ర‌సాద్ సున్నితంగా తిర‌స్క‌రించారు. దీంతో ఆనియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌రుపున ఎవ‌రు నిల‌బ‌డ‌తార‌నే సందిగ్ధం నెల‌కొంది. సందిగ్ధాన్ని ప‌టాపంచ‌లు చేస్తూ బి.మాధ‌వ్‌రెడ్డిని ప్ర‌క‌టించారు.

మాధవ్‌ను అందరూ ఆదరించాలని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. తాళ్లూరు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -