ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ జనగ్ నిప్పులు చెరిగారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ….రాష్ట్రంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా జాతీయ రాజీయాలంటూ దేశ వ్యాప్తంగా తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవ చేశారు.
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తూన్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ప్రత్యేక విమానాల్లో దేశాలు తిరుగుతున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల పేరుతో బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం కుమార స్వామితో కలిసి టీ తాగుతాడు. కానీ కరువుతో విలవిలలాడుతున్న అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు మాత్రం సమయం ఉండదన్నారు.
అంతటితో ఊరుకుంటాడా చెన్నై వెల్లి స్టాలిన్తో ఇడ్లీ, సాంబార్ తింటాడు గాని పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాలను మాత్రం పట్టించుకోరన్నారు. అంతటితో ఊరుకుంటాడా…ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్లి అక్కడ సీఎం మమతా బెనర్జీని కలిసి చికెన్ తింటాడు అని విరుచుకుపడ్డారు జగన్.