ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా పుత్తూరులోని నగరి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అనేక మంది జాతీయ నేతలు సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనను మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మెరపు వేగంతో నడిపిస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారని, కరోనా కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు.
గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న సీఎం వైయస్ జగన్ మాత్రమే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదని, దేవుళ్ల యజ్ఞాలను రాక్షసులు అడ్డుకున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకోకపోతే ఈసారి 23 సీట్లు కూడా రావని ఆర్కే రోజా పేర్కొన్నారు.
టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?
చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?