Saturday, April 27, 2024
- Advertisement -

ద‌స‌రారోజునె మ‌హూర్తం…బిజీ ప‌నుల్లో పీకె టీం…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అధికారాన్ని చేప్ట‌టే విధంగా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో కొద్దిలో అధికారాన్ని చేజార్చుకున్న ఆయ‌న ఇప్పుడు ప‌క‌డ్బందీ వ్యూహాల‌తో ముందుకెల్తున్నారు. ఇచ్చె నెల‌నుంచి అన్న వ‌స్తున్నాడు పాద‌యాత్ర కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికె దానికి సంబంధించిన ప‌నులు చ‌కచ‌కా జ‌రుగుతున్నాయి.

రాష్ట్రం విడిపోయినా హైద‌రాబాద్‌లో నుంచె పార్టీ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు. దీనిపై జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉంది. రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉంటూ రాష్ట్రం వెలుపల నివాసం ఉండడం, అడపాదడపా రాష్ట్రంలో పర్యటిస్తూ ఉండడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీనే ఎన్నోసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో ఉండని నేత ఈ రాష్ట్రానికి ప్రతిపక్షనేత ఎలా అవుతారని ప్రశ్నించింది. ఇన్నాళ్లూ ఈ విమర్శలను భరించిన జగన్.. ఇకపై ఎంతమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్ లోటస్ పాండ్ లో సకల హంగులతో ఇంటితో పాటు రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుకోకుండా రాష్ట్ర‌విభ‌జ‌న జ‌గ‌ర‌డంతో టీడీపీ త‌ట్టాబుట్టా స‌ర్దుకొని ఏపీలో వాలిపోయింది. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని, ప్రతిపక్షనేత ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని సలహాదారు ప్రశాంత్ కిశోర్ సూచించడంతో జగన్ నిర్ణయం మార్చుకున్నారు.

ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే జగన్ తన ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లికి మార్చబోతున్నారు. ఇక్కడ కూడా లోటస్ పాండ్ లో లాగే ఇల్లు, పార్టీ ఆఫీస్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ నేల 21వ తేదీ లండన్ నుంచి జగన్ ఇండియా రానున్నారు. 27వ తేదీన లేకుంటే దసరా రోజు పార్టీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెల 27వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ కార్యాలయం నుంచే అన్నింటినీ మానిటర్ చేయాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. ఈమేరకు కొత్త ఆఫీసులో అత్యాధునిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, వాటిని పార్టీ కార్యాలయంతో అనుసంధానించడం.. లాంటి పనుల్లో పీకే టీం బిజీగా ఉంది. జ‌గ‌న్‌కు ఇద అతి పెద్ద ప్ల‌స్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -