ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ప్రచారంలో దూకుడు పెంచాయి.ఇప్పటికే జగన్ పాదయాత్ర పేరుతో జనాల్లో ఉంటే..టీడీపీకూడా ఆత్మగౌరవ సభల పేరుతో ప్రజల్లో దూసుకు పోతోంది. ఇక జనసేన అధినేత పవన్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్రలో మరింత జోరు పెంచారు. ఒకరి మీద ఒకరు సవాల్లు, ప్రతి సవాల్లు విసురుకుంటుండంతో రాజకీయాలు హీట్ ఎక్కాయి.
అయితే జగన్ హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపనలు కొనసాగుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై ఢీ అంటే ఢీ అన్నట్లుగా పాలిటిక్స్ సాగుతుందని అంచనా వేస్తున్నారు. పాదయాత్ర తరువాత జగన్ తన జోరును జనసేన, టీడీపీపై మరింతంగా పెంచనున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి.
టీడీపీ ఏపీనుంచే రాజకీయాలు చేస్తోంది. తిపక్ష వైసీపీ మాత్రం తెలంగాణా రాజధాని హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ గత ఏడాదిగా పాదయాత్ర పేరిట జనంలో ఉన్నారు. దాంతో ఆయన మొత్తంగా ఏపీలోనే ఉన్నట్లైంది. దీన్ని కంటిన్యూ చేసేలా తన మకాం ని పూర్తిగా అమరావతికి షిఫ్ట్ చేయాలని జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
పాదయాత్ర ఇప్పటి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ కి పూర్తి అవుతుంది. ఆ తరువాత జగన్ తన నివాసాన్ని అమరావతి కి మార్చుతారట. అక్కడ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం పూర్తి హంగులతో నిర్మించే పని ఇపుడు చురుకుగా సాగుతోంది. అదే విధంగా కుటుంబంతో సహా జగన్ అమరావతి కి తరలి వస్తారట. అక్కడనుంచే రాజకీయాలు నడిపించనున్నారంట జగన్.