Thursday, May 2, 2024
- Advertisement -

బ్రేకింగ్ః పాదయాత్ర తర్వాత పార్టీకోసం, ప్రజల కోసం మరో అదిరిపోయే ప్లానింగ్‌తో జగన్

- Advertisement -

ఒక్క అడుగైనా పడుతుందా లేదా? శ్రీకాకుళం వరకూ చెయ్యగలడా అన్న అనుమానాల మధ్య పాదయాత్రను నభూతో అనే స్థాయిలో సక్సెస్ చేశాడు జగన్. ఇప్పుడు అంతకుమించి అనే స్థాయిలో మరో అదిరిపోయే ప్లానింగ్‌తో ప్రజల మధ్య ఉండనున్నాడు. జనవరి 6 నుంచి పదో తేదీలోపు ఇచ్ఛాపురంలో చివరి సభతో జగన్ పాదయాత్ర పూర్తవుతుంది. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ఇప్పటి వరకూ కూడా దేశంలోనే వేరే ఏ నాయకుడు లేనంత స్థాయిలో ప్రజల మధ్యనే ఉన్నాడు జగన్.

ఇప్పుడు పాదయాత్ర అయ్యాక కూడా సీమాంధ్రులకు దగ్గరగా ఉండడానికి అమరావతికి తన కార్యకలాపాలు మార్చనున్నాడు జగన్. అమరావతికి దగ్గరలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైకాపా ఆఫీస్‌కి పూర్తిగా మారిపోనున్నాడు జగన్. పూర్తి సమయంలో ప్రజల కోసమే కేటాయిస్తూ అనుక్షణం ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే వైకాపా నాయకులు, కార్యకర్తలను ప్రతి రోజు కలుస్తూ వాళ్ళను ఎన్నికలకు రెడీ చేసే కార్యక్రమం చేయనున్నాడు.

2014 ఎన్నికల్లో వైకాపా ఓటమికి ఒక కారణం పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేకపోవడమే. ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో వైకాపా పోల్ మేనేజ్మెంట్ పీపుల్‌ని రెడీ చేయనున్నాడు జగన్. నాయకుల నుంచీ కార్యకర్తల వరకూ వ్యక్తిగతంగా కలుస్తూ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్నింటికీ మించి అనుక్షణం ప్రజల మధ్యలో ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడికి, టిడిపి బ్యాచ్‌కి ఈ విషయం కచ్చితంగా ఆందోళన కలిగించేదే. ప్రజల మధ్యలో ఉండడానికి జగన్ చేసుకుంటున్న కార్యక్రమాలపై బాబు అండ్ కో ఎలా కౌంటర్స్ వేస్తారో చూడాలి మరి. ఏది ఏమైనా జగన్ కార్యక్రమాల ప్లానింగ్ చూస్తూ ఉంటే మాత్రం 2014 ఎన్నికలతో పోల్చితే జగన్‌లో చాలా పరిణతి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -