Tuesday, May 14, 2024
- Advertisement -

ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల‌కు జ‌గ‌న్‌ వార్నింగ్

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు చాలా రోజుల స‌మ‌యం ఉన్నా వైసీపీలో మాత్రం అప్పుడే మంత్రి ప‌ద‌వుల‌గోల మొద‌ల‌య్యింది. పోలింగ్ త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్‌, స‌ర్వేలు అన్ని కూడా వైసీపీకీ అనుకూలంగా ఉండ‌టంతో పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే పార్టీలో కొందురు నేత‌లు మంత్ర ప‌ద‌వులు మాకే నంటూ ప్ర‌చారం చేసుకోవ‌డం ఇప్పుడు ఆ పార్టీల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గెలుపోట‌ముల సంగ‌తి అలా ఉంచితే త‌మ‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మైపోయింద‌ని త‌మ అనుచ‌రుల‌తో చెప్పుకుని మురిసిపోతున్నారు. కొంద‌రు సీనియారిటీ చూసుకుంటె మ‌రికొంద‌రు సామీజిక స‌మీక‌ణాలు బేరీజు వేసుకొని సొంత డ‌బ్బా కొట్టుకుంటున్నారు.

ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. పోలింగ్ స‌ర‌ళిపై జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్నా …కొందురు నేత‌లు మాత్రం మంత్రి ప‌ద‌వి త‌మ‌కంటే త‌మ‌కంటూ మీడియాకు లీకులు ఇస్తుండ‌డంతో ఈ మ్యాట‌ర్ ఆ నోటా ఈ నోటా జ‌గ‌న్‌కు చేర‌డంతో సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. ఫ‌లితాలు వ‌చ్చేంత‌వ‌ర‌కు నేత‌లు ఎవ‌రూ మ‌రో సారి మంత్రి ప‌ద‌వుల‌పై నోరు జార‌వ‌ద్ద‌ని సీనియ‌ర్ల ద్వారా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని.. తామే మంత్రి అవుతున్నామ‌ని చాలా మంది చెప్పుకున్నారు. తీరా ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. ఇప్పుడు ఇలా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్ల‌కుండా ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు కామ్‌గా ఉండాల‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇంకో సారి ఇలాంటి సీన్ రిపీట్ కావ‌ద్ద‌ని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -