ఎన్నికల ఫలితాలు రాకుముందె వైసీపీ మంత్రి పదవుల లొల్లి మొదలయ్యింది. కొందరు నేతలు తమకు మంత్రిపదువులు ఖాయం అంటూ ప్రచారం చేసుకుంటున్న నేతల ఎక్కువ సంఖ్య పెరిగిపోతోంది. అలా జరిగిన ప్రచారంపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారని సమాచారం . ఎమ్మెల్యేల అనుచరులు కాస్త కంట్రోల్ లో ఉండకుంటే మొదటికే మోసం వస్తుందని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వయంగా చేయించుకున్న సర్వేలో వైసీపీ భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.
ఈ నేపధ్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను అనుచరులు తమ నాయకుడు మంత్రి అని సంబరపడిపోతే పర్వాలేదు ఏకంగా ఫ్లెక్సీలు, వాటర్ బాటిల్స్ మీద స్టిక్కర్లు వేసి కాబోయే మంత్రి అంటూ మరీ రాసేసి లేని పోని చిక్కులు తెచ్చారు. ఈ విషయం జగన్ దాకా వెల్లడంతో సీరియస్ అయినట్లు సమాచారం.
దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను అలర్ట్ అయ్యారు. అధినేత అక్షింతలు వేసింది తనకేనని భావించిన ఆయన ఎన్నికల ఫలితాలు రాకముందే కాబోయే మంత్రి అని ప్రకటించడం సరికాదని కార్యకర్తలకు సూచించారట. అభిమానులు, కార్యకర్తలు సైతం కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు గానీ స్టిక్కర్ల ద్వారా గానీ ప్రచారం చేయోద్దని కాస్త సంయమనం పాటించాలని జగన్ చెప్పారని టాక్. ఏది ఏమైనా ఫలితాలు వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటె మంచిదనే భావనలో ఉన్నారు మిగలిన నేతలు.