పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్న తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీక్షలు చేపట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. బిజీ షెడ్యూల్ వల్ల దీక్షకు హాజరుకాలేకపోతున్న మోదీ… ఉపవాసాన్ని పాటిస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రోజు నిరాహారదీక్షను ఈ రోజు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ‘నరేంద్ర మోదీగారు… మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా… 6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి’ అంటూ ట్వీట్ చేశారు.
PM @narendramodi ji, as you observe a fast today, 5 AP MPs have been hospitalized after a 6 day hunger strike over denial of SCS. Please hear the voices of 5 cr people of AP & grant the promise of SCS made on the floor of the house.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2018