ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి భక్తిభావం కాసింత ఎక్కవే. కాదు జాతకాల దగ్గర నుంచీ వాస్తు , ముహూర్తాలు చూసుకోవడం చేసే ఏ పనికి అయినా మంచి రోజు ఉందా లేదా అనేది చూసుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఆయన అసలు తన దగ్గర ఉన్న జ్యోతిష్యులని అడగకుండా ఒక్క పనికి కూడా దిగరు అనేది అందరి దగ్గరా చెప్పే మాట. దీన్ని ప్రత్యక్షంగా చూస్తూనె ఉన్నాం.
అయితే ప్రతిపక్ష నేత జగన్ విషయం లో మాత్రం దీనికి సంబంధించి వేరే స్టోరీ ఉంది అయితే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మాత్రం మొదట్లో వీటిమీద నమ్మకం ఉండేదికాదంటారు. కొన్ని సార్లు మహూర్తబలాలు, జాతకాలు జగన్ పట్టించుకోకపోవడం వల్లే ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అందుకే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు జగన్కు దేవుని ఆశీస్సులు లేవనె చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు జగన్కూడా వీటిని నమ్ముతున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ నెల 27 నుంచీ జగన్ పాదయాత్రను మొదలు పెట్టాలి. కాని దాన్ని పోస్ట్ పోన్ చేసి మంచి రోజు ఐన నవంబర్ 2 కి మార్చారు. దీనికి ప్రధాన కారనం జ్యోతిష్యుల మాట. నవంబర్ 2 నుంచి పాదయాత్ర మొదలు పెడ్తే మంచి జరుగుతుందని చెప్పడంతో పాదయాత్రను నవంబర్ 2కి మార్చారు.
దీనికి తోడు కొంతమంది పండితుల సలహా మేరకు దుర్గాష్టమి రోజున పార్టీకి సంబంధించి ఓ కీలకమైన ముందడుగు వేశారంటూ ఓ కథనం మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్రంలోని భాజపాకి దగ్గయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ ఎంపీ కొడుకు తో జగన్ రహస్యంగా మాట్లాడారు అనీ దానికి కూడా దుర్గాష్టమి ని పర్ఫెక్ట్ డేట్ గా ఆయన మలచుకున్నారు అనీ తెలుస్తోంది.
వారిద్దరి మధ్యనా గంటకు పైగా డిస్కషన్ సాగగా ఆ డిస్కషన్ టైమింగ్ కూడా ముహూర్తం చూసే ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆ ఎంపీ కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. భాజపా అనుబంధ సంస్థలతోపాటు, కొంతమంది ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయనీ, అందుకే జగన్ కలుసుకున్నారని అంటున్నారు. గతంలో ముహూర్తాలను పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నెమ్మది వాటిని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడి బాటలోనె జగన్ నడుస్తున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి ముహూర్త బలాలు జగన్కు ఎంతమేరకు మేలు చేస్తాయో మున్ముందు చూడాలి.