వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిని రోజా ప్రత్యర్థిపార్టీలపై తన పంచ్లు పేలుస్తున్నారు. అవతలి వారు ఎవరైనా , ఎంతవారైనా సరే మాట్లాడాల్సిన మాటలు జంకులేకుండా మాటలను తూటాలను పేలుస్తుంది.అందుకే రోజా అంటె అధికార పార్టీ నాయకుల్లో ఒకింత భయం.
తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సహజంగానే నోటికి ఎంతొస్తే అంత.. ఎలాపడితే అలా మాట్లాడే జబర్దస్త్ రోజా..ఓ మీటింగ్లో పవన్ను దారుణంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఏపీకి ప్రత్యేక హోదా పేరెత్తితే పవన్ ఎందుకు పారిపోతున్నారని రోజా రెచ్చిపోయారు. అంతటితో ఊరికుండలా ఇంకా రెచ్చిపోయింది. ప్యాకేజీ ఆశించి పవన్ ఇలా పారిపోతున్నారో చెప్పాలని బహిరంగంగా రోజా నిలదీశారు. కేంద్రంతో పోరాడే శక్తిలేని రబ్బర్ సింగ్ అని విమర్శించారు. పవన్కు చిత్తశుద్ధిలేదని మరోచోట రోజా విమర్శించారు. ఒంటరిగా ప్రత్యేక హోదా కోసం పోరాడే దమ్ములేకపోతే జగన్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు.
అంతటితో ఆగలా ఇంకా రెచ్చిపోయింది. తలాతోక లేని పార్టీగా జనసేన పార్టీని ఆమె విమర్శించారు. తన ప్రసంగాన్ని జనాకర్షణ దిశగా మళ్లించుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి సభలో రోజా పవన్పై రకరకాలుగా విమర్శలు చేయడం మామూలు అయిపోయిందని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కాపు సోదరులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే పవన్ ఎక్కడికి వెళ్లారని ఏకంగా కులం కార్డును కూడా వాడుతూ ఒక సభలో రోజా విమర్శలు చేశారు.అయితే ఇప్పటి వరకు పవణ్ స్పందించలేదు.ఇకనైనా స్పిందిస్తారో చూడాలి.
- Advertisement -
ఉడికిపోతున్న పవణ్ అభిమానులు…. ధైర్యంలేని రబ్బర్ సింగ్..
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -